ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీవితంలో ఈ గెలుపు మర్చిపోలేను

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 05, 2024, 06:22 PM

‘ఎన్నికలు ముగిసాయి గేమ్ ఓవర్ అయ్యింది. ఈ గేమ్‌లో ప్రజలు విన్నర్స్ అయ్యారు. ఒకే నియోజకవర్గంలో వరుసగా గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేల వరుసలో నేను చేరాను. మళ్లీ జన్మంటూ ఉంటే ఈ గెలుపును మరచిపోలేను. గేమ్ చైంజర్ అన్న ఆదాల ప్రయత్నాలు రూరల్లో విఫలం అయ్యారు. ఈ ఎన్నికల్లో ఉచ్చ నీచాలు మరచి నా వ్యక్తిత్వాన్ని హననం చేశారు. నా కుటుంబ సభ్యులను సైతం అవమానపరిచారు. కుట్రలు, కుతంత్రాలు నాకు తెలియదు. ప్రజల పక్షాణ ఉంటాను. అందుకే అధికారాన్ని ధిక్కరించి బయటకు వచ్చా. జగన్మోహన్ రెడ్డిని డీకొట్టిన నేను ఈ పసికూనలను లెక్కచేయను. ప్రజల అండ ఉంటే కొండలను సైతం తలతో కొడితే పగిలిపోతాయి. నా గెలుపు కోసం టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు చేసిన కృషి మరువలేను. వామపక్ష సానుభూతి పరులు నిశ్శబ్ద విప్లవం చేసి నన్ను గెలిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొందరు నాయకులు సైతం నా విజయానికి కృషి చేశారు. నా వెంట నడిచిన నాయకులకు ఒకటే మాట చెపుతున్నాను. కక్ష సాధింపులకు పాల్పడవద్దని కోరుకుంటున్నాను. కక్ష సాధింపులకు పాల్పడితే నా గడప మెట్లు కూడా తొక్కనివ్వను. పదికాలాలు నెల్లూరు రూరల్ ప్రజల గుండెల్లో నిలిచిపోయే పనులు చేస్తాను. అధికారం వచ్చింది అని అహంకారం తలకేక్కితే మనకు కూడా జగన్మోహన్ రెడ్డికి వచ్చిన పరిస్థితే వస్తుంది. వైసీపీ నాయకులకు కూడా ఒక మాట చెప్తున్నాను. నా మంచితనాన్ని చేతగానితనంగా, నన్ను అసమర్ధుడుగా మాత్రం చూడవద్దు. వైసీపీ నాయకులు డ్రగ్స్ సిగరెట్లు, గంజాయి, ఇసుక మాఫియా, అక్రమాలు, క్రికెట్ బెట్టింగ్, భూ దందాలు చేస్తాం అంటే చట్టం తన పని తాను చేస్తుంది. షోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెడితే చట్టం తన పని కఠినంగా చేస్తుంది.’ అని వైసీపీ శ్రేణులకు  ఎమ్మెల్యే కోఠం రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com