ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమ్ముడిని హత్య చేసిన అన్నయ్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 05, 2024, 06:20 PM

తమ్ముడిపై అన్న కత్తెరతో దాడి చేసిన ఘటన సీతానగరం మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. ఈ దాడిలో గాయపడిన తమ్ముడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రంలోని పెదభోగిల కాలనీలో గుజ్జుల రవీంద్రకుమార్‌, హేమంత్‌ తమ కుటుంబాలతో నివాసం ఉంటున్నారు. అయితే తమ ఇంట్లో నిల్వ ఉంచిన కలప విషయంలో ఇద్దరి మధ్య మంగళవారం తగాదా జరిగింది. ఈ ఘర్షణలో అన్న రవీంద్ర ఆవేశంతో తమ్ముడు హేమంత్‌(42) మెడపై కత్తెరతో దాడి చేశా డు. దీంతో హేమంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబీకులు వెంటనే పార్వతీ పురం ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా హేమంత్‌ మార్గమధ్యంలో మృతిచెం దాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబీకులు అందజేసిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఎం.రాజేష్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com