ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మమ్మల్ని అవమానకరంగా మాట్లాడారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 05, 2024, 03:31 PM

గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం పనితీరును గమనించిన ఏపీ ప్రజలు విలక్షణమైన తీర్పును ఇచ్చారు అని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అన్నారు. ఆమె మాట్లాడుతూ....... పాలనను గాలికొదిలేసి వైసీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ప్రజలంతా చూశారు. అక్రమ కేసులు బనాయించి చంద్రబాబును జైల్లో పెట్టి.. ఆయన కుటుంబాన్ని తీవ్రంగా వేధించారు. రాజకీయాలతో సంబంధం లేకపోయినా నన్ను  వైసీపీ నేతలు లక్ష్యంగా చేసుకున్నారు. ఏపీ అసెంబ్లీలో నా వ్యక్తిత్వాన్ని అవమానపర్చేలా వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. చంద్రబాబు కుటుంబ సభ్యులను ఎంతో హేళన చేశారు. మరోవైపు మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పట్ల అవమానకరరీతిలో వైసీపీ నాయకులు వ్యవహరించారు. వీటన్నింటిని ఏపీ ప్రజలు గమనిస్తూ వచ్చారు. తమకు సమయం వచ్చినప్పుడు సరైన తీర్పు చెప్పాలని నిర్ణయించుకున్న ఓటర్లు ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పారు అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com