ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్న మహిళ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 05, 2024, 03:28 PM

తనకల్లు మండలంలోని రామప్పకుంటతండాకు చెందిన మహిళ మౌనిక మంగళవారం సీజీ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఇంటి వద్ద నుంచి మౌనిక తన ఐదేళ్ల కుమార్తె జాహ్నవి పిలుచుకుని సీజీపీ వద్దకు వెళ్లింది. అందులో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. మౌనిక ప్రాజెక్టులోకి దూకగానే గట్టుపై ఉన్న జాహ్నవి గట్టిగా కేకలు వేసింది. దీంతో ప్రాజెక్టులో చేపలు పట్టుకుంటున్న వారు పాప కేకలు విని అప్రమత్తమయ్యారు. వెంటనే ప్రాజెక్టులోకి దూకి మౌనికను రక్షించారు. కొక్కంటి క్రాస్‌లో ఉన్న శ్రీనాథ్‌ అనే యువకునికి సమాచారం అందించారు. శ్రీనాథ్‌ మౌనికను, జాహ్నవిని తనకల్లు పోలీసులకు అప్పగించారు. తన భర్త, అత్త పెడుతున్న వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించినట్లు మౌనిక వివరించినట్లు ఎస్‌ఐ ధరణీ బాబు తెలిపారు. ఈవిషయంపై విచారణ చేపట్టి కేసు నమోదు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com