ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల స్థానంలో ఇతర అధికారులను నియమించేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ ప్రభుత్వం రెండు ప్యానళ్లను పంపించింది. పల్నాడు జిల్లా కలెక్టర్ నియామకానికి జీ. వీరపాండ్యాన్ (ఏపీ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ) పేరుతో ప్యానల్ను పంపించింది. ఆయా జిల్లాల ఎస్పీల పరిశీలనకు ఏపీ ప్రభుత్వం పలు పేర్లను సూచించింది. వీరిలో.. సాలి గౌతమి(విశాఖపట్నం ఏపీ ఎస్పీ 16వ బెటాలియన్ కమాండెంట్), మల్లికా గార్గ్ (సీఐడీ ఎస్పీ), వి హర్షవర్ధన్ రాజు(సీఐడీ, ఎస్పీ), డి నరసింహ కిషోర్ (తిరుపతి, టీటీడీ సీవీ అండ్ ఎస్వో) విజయవాడ, జగ్గయ్యపేట డీసీపీలతో పాటు లత్క ర్ శ్రీకేష్ బాలాజీ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్) చేవూరి హరికిరణ్( అగ్రికల్చర్ స్పెషల్ కమిషనర్ల) పేరుతో మరో జాబితాను కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ ప్రభుత్వం పంపించింది.