ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే లైన్.. ఈ రూట్‌లోనే, తగ్గనున్న ప్రయాణ సమయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 24, 2024, 07:44 PM

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. పూడి- ఏర్పేడు రైల్వేస్టేషన్ల మధ్య నూతన రైలు మార్గం ఏర్పాటు చేయడానికి రైల్వే బోర్డు చర్యలు ప్రారంభించింది. దక్షిణాది నుంచి ఉత్తరాదిలోని ప్రధాన నగరాలకు తక్కువ సమయంలో వస్తు రవాణా చేయడానికి రైల్వే బోర్డు ఈ నూతన మార్గాన్ని వేయడానికి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వస్తు రవాణా చేసే గూడ్స్‌ రైళ్లు పూడి నుంచి రేణిగుంట రైల్వే జంక్షన్‌కు చేరుకుంటాయి. అక్కడి నుంచి ముంబై, విజయవాడ మార్గాలవైపు వెళతాయి.


సదరన్‌ రైల్వే నుంచి ఉత్తర భారత దేశంలోని ప్రధాన నగరాలకు వస్తు రవాణా చేయడానికి రేణిగుంట రైల్వే జంక్షన్‌లో కొంత ఆలస్యం జరుగుతోందని రైల్వే బోర్డు అధ్యయనం చేసింది. ఈ మార్గంలో గూడ్స్‌ రైళ్లతో పాటు సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లు కూడా రాకపోకలు నిర్వహించే అవకాశం ఉంటుందని అధికారులు గుర్తించారు. రైల్వే నిబంధనల మేరకు ప్రాథమిక సర్వే నిర్వహించారు. పూడి నుంచి ఏర్పేడు రైల్వేస్టేషన్‌ వరకు 27 కిలోమీటర్ల దూరం సర్వే చేసినట్లు తెలుస్తోంది.


ఈ మార్గంలో ఒక రైల్వేస్టేషన్‌ కూడా వస్తుంది. ఈ రైలు మార్గం పూర్తిచేస్తే రేణిగుంట రైల్వే జంక్షన్‌లో జరుగుతున్న ఆలస్యాన్ని నివారించవచ్చని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు రేణిగుంట రైల్వే జంక్షన్‌పై రైళ్ల రాకపోకల ఒత్తిడీ తగ్గే అవకాశాలున్నాయి. ఈప్రాంతం నుంచి రైతులు పండించే వస్తువులు కూడా దూర ప్రాంతాలకు రవాణా చేసే అవకాశం ఏర్పడనుంది. అలాగే రేణిగుంట, ఏర్పేడు మండలాల్లోని భారీ పరిశ్రమల ఉత్పత్తులు కూడా రవాణా చేయడానికి అనుకూలంగా ఉంటుందంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com