ఇండియాతో ఉద్రిక్తతలు, మోదీ లక్ష్యద్వీప్ పర్యటన అనంతరం మాల్దీవ్స్కు వెళ్లే భారత పర్యాటకుల సంఖ్య 50 శాతం తగ్గిందని, మాల్దీవ్స్ పర్యాటక మంత్రిత్వశాఖ వెల్లడించింది. అదే సమయంలో చైనా పర్యాటకుల సంఖ్య 200 శాతం పెరిగిందని వెల్లడించింది. 2023 జనవరి- మార్చి మధ్య 56,208 మంది భారతీయ పర్యాటకులు మాల్దీవ్స్ను సందర్శించగా.. 2024లో జనవరి- మార్చి మధ్య కేవలం 34,847 మంది మాత్రమే సందర్శించారని వెల్లడించింది.