అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాలతో నామినేషన్ కేంద్రాల వద్ద సోమవారం పటిష్ట బందోబస్తు కొనసాగుతోంది. ఎన్నికల నియమ నిబంధనలు అందరూ పాటించేలా చర్యలు చేపట్టారు. జిల్లాలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ లు దాఖలు చేసేందుకు జిల్లా కలెక్టరేట్, గుంతకల్లు, కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయాలు, రాయదుర్గం, తహశీల్దార్ కార్యాలయాల వద్ద ఆయా పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నారు.