కన్నవారి హృదయాల్లో భారాన్ని నింపి, వారి ఆశలను ఆడియాసలు చేసి బలవన్మరణాలకు పాల్పడవద్దని వైవీయూ వీసీ ఆచార్య చింతా సుధాకర్ విద్యార్థులకు ఉద్బోధించారు. వైవీయూ బయోటెక్నాలజీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ఎస్. షమ్మా సుల్తానా ఆకస్మిక మృతిపై సంతాప సభను గురువారం విశ్వవిద్యాలయ పరిపాలన భవన ప్రాంగణంలో నిర్వహించారు. వీసీ సుల్తానా చిత్రపటం వద్ద అంజలి ఘటించారు. వీసీ మాట్లాడుతూ విద్యార్థిని మృతి బాధాకరమని చెప్పారు.