ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే మరియు గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి శుక్రవారం ఆయన నివాసం నుండి నామినేషన్ వేయడానికి బయల్దేరారు. కార్యక్రమంలో ముందుగా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని, ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గిద్దలూరు బయలుదేరారు. ఆయన వెంట నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.