పోలింగ్ ముగిసేలోపు అసెంబ్లీ అభ్యర్థులు తమ పరిధిలోని ప్రతిఇంటికీ కనీసం నాలుగుసార్లు వెళ్లాలని చంద్రబాబు నిర్దేశించారు. పార్టీ ఇచ్చిన హామీలను వారికి వివరించాలని పార్టీ జోనల్ ఇన్చార్జులతో భేటీలో ఆదేశించారు. ‘అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లేలా చూడాల్సిన బాధ్యత మీది. జనసేన, బీజేపీ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో పనిచేసేలా చూడాలి. అవి మన సొంత నియోజకవర్గాలుగా భావించి ఆ అభ్యర్థులను గెలిపించి తీసుకురావాలి. ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురండి. ఈనెల రోజులూ పార్టీ పర్యవేక్షక యంత్రాంగం 24 నాలుగు గంటలూ పనిచేయాలి’ అని ఆయన స్పష్టం చేశారు.