శ్రీసత్యసాయి జిల్లా మడకశిర(ఎస్సీ)లో ప్రస్తుత కూటమి అభ్యర్థి అనిల్ కుమార్ను మార్చాలని నిర్ణయించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి వర్గం గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఈ సీటును పార్టీ దళిత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజుకు ఇవ్వనున్నారు. ఈయనది అనంతపురం జిల్లాయే. ఈయన్ను తొలుత బాపట్ల (ఎస్సీ) లోక్సభ అభ్యర్థిగా ప్రకటించాలనుకున్నా.. కుదరలేదు.