కొండేపి నియోజకవర్గంలో శుక్రవారం పలు మండలాల్లో జరిగే కార్యక్రమాల్లో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖామంత్రి, వైసీపీ కొండేపి అసెంబ్లీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ పాల్గొంటారని కార్యాలయ ప్రతినిధి తెలిపారు. ఉదయం 8. 30 గంటలకు సింగరాయకొండ పార్టీ కార్యాలయంలో, మధ్యాహ్నం 12 గంటలకు పొన్నలూరు పార్టీ కార్యాలయంలో, 2 గంటలకు మర్రిపూడి పార్టీ కార్యాలయంలో జరిగే పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.