ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీరేమీ అమాయకులు కాదు.. బాబా రాందేవ్‌కు సుప్రీంకోర్టు అక్షింతలు

national |  Suryaa Desk  | Published : Tue, Apr 16, 2024, 08:46 PM

పంతజలి తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో యోగా గురు బాబా రాందేవ్‌, ఆ సంస్థ ఎండీ బాలకృష్టలపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో పతంజలి సంస్థపై చర్యలు తీసుకోవడంలో ఉపేక్షించారని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని కూడా తూర్పారబట్టింది. మంగళవారం నాటి విచారణకు జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ ఏ అమనుల్లాహ్ ధర్మాసనం ముందు రాందేవ్, బాలకృష్టలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబా రాందేవ్ యోగాకు గణనీయమైన కృషి చేశారని కొనియాడారు.‘యోగా కోసం మీరు చేసిన పనిని మేము గౌరవిస్తాం’ అని బెంచ్ పేర్కొంది. కాగా, తాము బహిరంగ క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని, సుప్రీం కోర్టు ప్రతిష్టను దిగజార్చడం తన ఉద్దేశం కాదని రామ్‌దేవ్ అన్నారు.


అయితే, బాబా రాందేవ్, బాలకృష్టల వైఖరి ఎత్తిచూపిన ధర్మాసనం.. ఆయుర్వేద ప్రయోజనాలను నొక్కిచెప్పడానికి ఇతర వైద్య వ్యవస్థలను ఎందుకు తక్కువచేశారని ప్రశ్నించింది. చట్టం అందరికీ ఒకటేనని జస్టిస్ అమానుల్లా వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఇలాంటిది పునరావృతం కాకుండా జాగ్రత్తగా ఉంటానని రామ్‌దేవ్‌ బదులిచ్చారు. దీనిపై న్యాయస్థానం.. అంతకుముందు జరిగిన అన్ని పరిణామాల నేపథ్యంలో ఈ అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది. ‘మిమ్మల్ని క్షమించాలా? వద్దా అని మేము నిర్ణయించుకోలేదు... మీరు మూడుసార్లు (ఆదేశాలను) ఉల్లంఘించారు. మునుపటి ఆదేశాలు మా పరిశీలనలో ఉన్నాయి. మీరు అమాయకులు కాదు, కోర్టులో ఏమి జరుగుతుందో మీకు తెలుసు’ అని కోర్టు వ్యాాఖ్యానించింది.


తదుపరి విచారణ ఏప్రిల్ 23కు వాయిదా వేసిన న్యాయస్థానం... రామ్‌దేవ్, బాలకృష్ణ మళ్లీ కోర్టుకు హాజరు కావాలని, కోర్టు ధిక్కారణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇక, కోర్టు వెలుపల మీడియాతో బాబా రాందేవ్ మాట్లాడుతూ.. నేను చెప్పవలసింది చెప్పాను.. న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. ఇంతకముందు బాబా రాందేవ్ క్షమాపణలు కోరుతూ దాఖలు చేసిన అఫిడ్‌విట్‌‌లను దర్మాసనం తిరస్కరించింది. కోర్టు కంటే ముందు మీడియాకు పంపడంపై తీవ్రంగా మండిపడింది. ‘విషయం కోర్టుకు చేరే వరకు, మాకు అఫిడవిట్‌లు పంపడం సరైంనదని వారు భావించలేదు. వారు పబ్లిసిటీని స్పష్టంగా నమ్ముతారు’ అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com