మండల వ్యాప్తంగా తాగునీటి ఎద్దడికి నివారణ చర్యలు చేపట్టాలని ఉప మండల అధ్యక్షులు వెంకట మోహన్ రెడ్డి అన్నారు. యర్రగుంట్ల మండల పరిషత్ కార్యాలయ సభా భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప మండల అధ్యక్షుడు మాట్లాడుతూ. మండల వ్యాప్తంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు గ్రామాలలో పర్యటించి తాగునీటి ఎద్దడి లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సూచించారు.