దువ్వూరు మండలం జొన్నవరంకి చెందిన సూర్య నారాయణ రెడ్డి, కోటి, అంకల్, మహేశ్వరరెడ్డి, రమేష్రెడ్డి, రామ లక్షుమయ్య, రాముడు, ఓబులేసు, రాధా, లక్షుమయ్య, వెంకటయ్య తదితర 30 కుటుంబాలు మైదుకూరు నియోజకవర్గ ఎన్డిఏ కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షులు రమణారెడ్డి, జొన్నవరం వెంకటేశ్వర రెడ్డి, రాజ శేఖర్ రెడ్డి, లక్షుమయ్య, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.