ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఉమ్మడి కడప జిల్లా పర్యటనలో భాగంగా ఏప్రిల్ 19వ తేదీన రాయచోటి పట్టణంలో పర్యటించనున్నట్లు మాదిగ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు నాగిపోగు లక్ష్మీదేవి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం మైదుకూరు పట్టణంలో ఆమె మాట్లాడుతూ, ఉమ్మడి కడప జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన మాదిగ మహిళ సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.