ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మైదుకూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ గెలుపుకై ఎమ్మార్పీఎస్ మైదుకూరు నియోజకవర్గ ఇంచార్జి జయచంద్ర మాదిగ ఆద్వర్యంలో మంగళవారం దువ్వూరు మండలంలో పర్యటించి ప్రచార కమిటీని ఏర్పాటు చేసి ప్రతి మాదిగ పల్లెలో ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మైదుకూరు నియోజకవర్గ అధ్యక్షులు చుక్కా జీవన్ కుమార్ పాల్గొన్నారు.