కొరిశపాడు మండలం అనమనమూరు గ్రామానికి చెందిన ఆరుగురు వాలంటరీలు మంగళవారం తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి రాజీనామా పత్రాన్ని గ్రామ సచివాలయ అధికారికి అందజేశారు. అనంతరం వారు అద్దంకి వైయస్సార్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి హనిమిరెడ్డిని కలిసి తమ సంఘీభావం తెలియచేశారు. ప్రజలకు సేవ చేసే అవకాశం లేనందునే తమ ఉద్యోగాలకు రాజీనామా చేసామని పలువురు వాలంటరీలు వెల్లడించారు.