ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల దాహార్తి తీర్చేందుకు వాసవి క్లబ్స్ ఆఫ్ క్షీరపురి మంగళవారం చీరాల పట్టణంలోని కోట్ల బజారులో మూడు పాయింట్లలో ఏకకాలంలో మజ్జిగ, మినరల్ వాటర్ చలివేంద్రాలను ఏర్పాటు చేశాయి. సమ్మర్ ముగిసే వరకు దాతల సహాయ సహకారాలతో ఈ చలివేంద్రాలు నిర్వహిస్తామని క్లబ్స్ ప్రతినిధి తమ్మన పవన్ కుమార్ తెలిపారు. తొలి రోజున 3వేల మందికి మజ్జిగ పంపిణీ చేశామన్నారు. పలువురు యువతీ, యువకులు, పెద్దలు పాల్గొన్నారు.