బందిపోటు దొంగల ముఠా నాయకుడు చంద్రబాబు అంటూ వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. నీరు–చెట్టు పేరుతో మట్టిని దోచుకుని అమ్ముకున్న అసలు బందిపోటు దొంగల ముఠా నాయకుడివి నువ్వు కాదా?. వంద రూపాయలు ఖర్చు అయ్యే కాంట్రాక్టు పనులను మరో వందకు పెంచి ప్రభుత్వ ఖజానాను దోచుకున్న బందిపోటువి నువ్వు కాదా?.. ఫేక్ రాజధాని నిర్మాణం కోసం ఫేక్ దేశాలు తిరిగి..ఫేక్ ప్రయాణపు ఖర్చులు పెట్టి ఫేక్ ముఖ్యమంత్రిగా మిగిలిన అసలు బందిపోటువి నువ్వుకాదా? అంటూ సుధాకర్బాబు ప్రశ్నించారు.