అనంతపురం జిల్లా, ధర్మవరం మండలంలోని గరుడంపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు సూపర్సిక్స్ పథకాలపై ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు సీఎం అవగానే ఈ పథకాలను అమలు చేస్తారని తెలిపారు. ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన చిగిచెర్ల ఓబిరెడ్డి, మాజీ జడ్పీటీసీ మేకలరామాంజనేయులు, సర్పంచ ముత్యాలప్పనాయుడు, నాయకులు మహేష్చౌదరి, విజయసారథి, పాళ్యంవెంకటేష్, నారాఅశోక్, మల్లి, గరుడంపల్లి చంద్రశేఖర్ బీజేపీ మండల ఇనఛార్జ్ అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.