ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్‌ గులకరాయి డ్రామాతో ప్రజలని తప్పుదారి పట్టిస్తున్నాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 16, 2024, 03:49 PM

ప్రతి కార్యకర్త సైనికునిలా పని చేయాలని పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరు చరిత పిలుపునిచ్చారు.ఓర్వకల్లు మండలంలోని వెంకటాపురం, చెన్నంచెట్టిపల్లె, కొమరోలు, సోమయాజులపల్లె, గుమితం తాండ, కాల్వ గ్రామాల్లో ఇంటింటి ప్రచారంతోపాటు భారీ ర్యాలీ, సభలు నిర్వహించారు. ఈసందర్భంగా గౌరు చరిత మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్‌ విధ్వంస పాలన కొనసాగిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఇంటికి సాగనంపాలన్నారు. జగన్‌ గులకరాయి డ్రామా ఆడుతూ ప్రజలను మభ్యపెట్టేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారని, ఇప్పటికే కోడికత్తి, వివేకా హత్య గురించి సీఐడీ తేల్చి చెప్పిందన్నారు. కార్యక్రమంలో నాయకులు గోవిందరెడ్డి, మోహన్‌రెడ్డి, లక్ష్మణ్‌రావు, విశ్వేశ్వరరెడ్డి, చదువుల సుధాకర్‌రెడ్డి, మహబూబ్‌బాషా, చంద్రపెద్దస్వామి, రాము, దేవేంద్ర, హనుమంతరావు, వెంకటరమణ, తిప్పాయపల్లె సుధాకర్‌ రెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, బ్రాహ్మణపల్లి నాగిరెడ్డి, భాస్కర్‌ రెడ్డి, వడ్డె వెంకటసుబ్బయ్య, నాగమల్లేష్‌, రామమద్దిలేటి, కురువ కృష్ణ, సంజీవ, లక్ష్మణ్‌ నాయక్‌, రజాక్‌, ఖాదర్‌, కేవీ మధు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com