ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారులు(పీవో), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారు లు(ఏపీవో) ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల పనితీరు పై అవగాహన పెంచుకోవాలని ఆర్డీవో హరిప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం మదనపల్లె బీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో పీవోలు, ఏపీవోలకు ఆర్డీవో పలు సూచనలిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...... ఎన్నికల ముందు రోజున పీవోలు, ఏపీవోలకు ఈవీఎంలు, వీవీప్యాట్లు, సీయూలు పంపిణీ చేస్తారన్నారు. ఏవైనా ఈవీ ఎంలు మరమ్మతుకు గురైతే సెక్టోరియల్ అధికారికి సమాచారం ఇచ్చి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్క్యాస్టింగ్ వుంటుందని ఎన్నికల నిర్వహణ పక్షపాతం లేకుండా సమర్థవంతంగా నిర్వహించాన్నారు.