ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల వద్దకే పరిపాలన తెచ్చిన నాయకుడు సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 16, 2024, 01:26 PM

ఐదేళ్ల పాల‌న‌లో స్కూల్‌కు వెళ్లే పిల్లల నుంచి వృద్ధాప్యం వచ్చిన అవ్వాతాతల వరకు వారికి కావాల్సిన ప్రతి అవసరాన్ని తీరుస్తున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని మాజీ మంత్రి, వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. గుడివాడ‌లో ఏర్పాటు చేసిన మేమంతా సిద్ధం బ‌హిరంగ స‌భ‌లో కొడాలి నాని మాట్లాడారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ పాలనతోనే సంక్షేమం సాధ్యమైందని, వాలంటీర్‌ వ్యవస్థతో ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చారని చెప్పారు. పిల్లల భవిష్యత్‌ కోసం ఆలోచించిన నాయకుడు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాత్ర‌మేన‌న్నారు. ఆరోగ్యశ్రీ ప‌థ‌కం ద్వారా ఎంతోమందిని ఆదుకున్నారని గుర్తుచేశారు. ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తున్న సీఎం వైయ‌స్ జగన్‌ను ఎదుర్కోలేక చంద్ర‌బాబు కుట్రలు చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు. దేవుడు, ప్రజల ఆశీస్సులే జ‌గ‌న‌న్న‌ను కాపాడాయని వివ‌రించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com