ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆలయంలో దొంగల బీభత్సం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 29, 2024, 08:22 PM

జీవీఎంసీ 50వ వార్డు మాధవధార జంక్షన్ వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయంలో హుండీ చోరీకి గురైన ఘటన గురువారం వెలుగు చూసింది. ఈనెల 27న రాత్రి 1. 30 గంటల సమయంలో శబ్దం రావడంతో పక్కనే ఉన్న స్థానికులు బయటకు వచ్చి చూడగా ఆలయం గేటు తెరిచి ఉంది.
లోపల హుండీ లేదు. వెంటనే సమాచారం అందుకున్న ఎయిర్పోర్టు క్రైం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరాలను పరిశీలించగా ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి ఆలయం తాళం పగులగొట్టి హుండీని అపహరించినట్లు గుర్తించారు. వీరు పాత నేరస్థులనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com