కొండాపురం మండలంలోని కె. బొమ్మే పల్లె ఆర్ ఆర్ కాలనీలో మురికి కాలువలు సరిగా లేక కాలనీ వాసులు ఇబ్బందులు గురవుతున్నారు. ఈ సందర్బంగా మురికి నీరు పోయే కాలువలు లేక అవస్థలు పడుతున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాల పక్కన మురుగు నీరు రోడ్డుపై ప్రవహిస్తుండడంతో తీవ్ర అనారోగ్యానికి గురి అవుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని కాలనీవాసులు కోరుచున్నారు.