ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టెట్ పరీక్ష ఫీజు భారీగా పెంపు!

Education |  Suryaa Desk  | Published : Sat, Mar 23, 2024, 11:34 AM

రాష్ట్రంలోని నిరుద్యోగాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం టెట్ ఫీజును పెంచింది. ఒక్కో పేపర్‌కు ఫీజు రూ. 1000 నిర్ధారించబడింది. రెండు పేపర్లు రాయాలంటే రూ.2వేలు చెల్లించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు విద్యాశాఖ శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ చేసి దరఖాస్తులు సమర్పించాలి.
మే 20 నుంచి జూన్ వరకు 15 రోజుల పాటు ఆన్‌లైన్‌లో టెట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు కూడా ఈ టెట్‌కు హాజరయ్యే వెసులుబాటు కల్పించారు. డీఈడీ పూర్తి చేసిన వారు మాత్రమే టెట్ పేపర్-1కు అర్హులు. పేపర్ 2లో డిగ్రీ బీఈడీ ఉండాలి. జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50%, ఇతరులకు 45% మార్కులు. 2015 నాటికి జనరల్‌కు 50 శాతం, ఇతరులకు 40 శాతం ఉన్నవారు కూడా అర్హులని ప్రకటించింది. మరోవైపు ఫీజు తగ్గించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫీజులు ఉండవని చెప్పి.. ఇప్పుడు భారీగా ఫీజులు వసూలు చేయడం ఏంటి..? అని టెట్ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com