ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌కు వేదికలు ఖరారు

sports |  Suryaa Desk  | Published : Wed, Mar 20, 2024, 12:25 PM

నవంబర్‌లో టీమిండియాతో జరగనున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా వేదికలను ఖరారు చేసింది. పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో తొలి టెస్టు జరగనుంది. ఇటీవల పెర్త్‌లో పాకిస్థాన్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌కు పెద్దగా ప్రేక్షకులు హాజరు కాలేదు. ఈ నేప‌థ్యంలో టీమిండియాతో జ‌రుగుతున్న మ్యాచ్‌కి భారీగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ప్లాన్ చేస్తోంది. 
రెండో మ్యాచ్ అడిలైడ్ ఓవల్‌లో జరగనుండగా, మూడో టెస్టు మ్యాచ్ బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో జరగనుంది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో బాక్సింగ్ డే టెస్టు జరగనుంది. సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఆఖరి మ్యాచ్‌ జరుగుతుందని క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ సిరీస్‌తో టెస్టు క్రికెట్‌కు వారసత్వాన్ని తీసుకురావాలని క్రికెట్ ఆస్ట్రేలియా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com