ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరలా నరసరావుపేట ఎంపీగా పోటీ చేస్తా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 29, 2024, 03:33 PM

పల్నాడులో కీలక నేత, నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మార్చి 2వ తేదీన (శనివారం) తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆ రోజు గురజాలలో జరిగే ‘రా కదలి రా’  సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా గురువారం ఆయన నరసరావుపేటలో మీడియాతో మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, పల్నాడు అభివృద్ధికే తన ప్రతి అడుగు ఉంటుందన్నారు. మార్చి నెల 2వ తేదీన గురజాల వేదికగా జరగబోయే 'రా కదలి రా ' సభ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని శ్రీ కృష్ణదేవరాయలు పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమాన్ని, పల్నాడు అభివృద్ధికి కట్టుబడి మరలా నరసరావుపేట ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ, అభివృద్ధిని సాధించుటకే తన ప్రతి అడుగు, ఆలోచన ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఐదేళ్లలో సాధించుకున్న వాటిని పూర్తి చేసుకోవటంతో పాటుగా రానున్న కాలంలో ఇంకొన్ని పల్నాడులో అభివృద్ధి కార్యక్రమాలు సాధించుకోవాలని, వాటికి కట్టుబడి సదా తోడుగా ఉంటానని మరలా ఆశీర్వదించాలని శ్రీ కృష్ణ దేవరాయలు పల్నాడు ప్రజనీకాన్ని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com