నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో వచ్చే నెల 1వ తేదీన జరిగే దళిత శంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన ఎస్సీ నేతలతో సమావేశమై ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అజీజ్ మాట్లాడుతూ సమాజంలో మార్పు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. దళితులకు జరుగుతున్న అన్యాయంపై ఐక్య పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య, ఎస్సీ సెల్ నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు కాకి ప్రసాద్, నెల్లూరు పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు పనబాక భూలక్ష్మి, జిల్లా కార్యదర్శి కనపర్తి గంగాధర్, అధికార ప్రతినిధి కువ్వారపు బాలాజీ, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాతంగి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.