ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువగళానికి సంఘీభావం తెలిపిన జనసేన నాయకులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 28, 2023, 05:34 PM

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళానికి జనసైనికులు స్వాగతం పలికారు. రాజోల్ నియోజకవర్గంలో  బోడసకుర్రు బ్రిడ్జిపై యువనేత నారా లోకేష్‌కు జనసేన కార్యకర్తలు స్వాగతం పలికారు. యువగళానికి సంఘీభావంగా జనసేన, యువగళం జెండాలతో లోకేష్‌కి జనసైనికులు స్వాగతించారు. బ్రిడ్జి పొడవునా యువనేతను స్వాగతిస్తూ భారీ ఫ్లెక్సీలు జనసేన, టీడీపీ కార్యకర్తలు ఏర్పాటు చేశారు. నినాదాలు చేస్తూ యువగళంతో కలిపి అభిమానులు, కార్యకర్తలు అడుగులు వేశారు .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com