విజయనగరం జిల్లా, గజపతినగరం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే.... మండలంలోని బంగారమ్మపేట గ్రామానికి చెందిన బోను అప్పలనాయుడు(52) గజపతినగరంలో సొంత పనులు ముగించుకొని స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తుతుండగా జాతీయ రహదారిపై మదుపాడ జంక్షన్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొ ట్టింది. ఈ ప్రమాదంలో అప్పలనాయుడు అక్కడిక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యు ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.