ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ పట్ల అన్ని వర్గాల ప్రజల్లో నమ్మకం ఏర్పడింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 08, 2023, 05:08 PM

రానున్న ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించి ప్రజలకు మేలైన పాలన అందిస్తుందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు అన్నారు. ఎచ్చెర్లలోని నియో జకవర్గ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహిం చిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన మహానాడులో అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేసేలా టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసినట్టు చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోపై అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోతో వైసీపీ నేతల్లో భయం మొదలైందన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్య దర్శి, యువనేత నారా లో కేష్‌ యువగళం పేరిట చేప ట్టిన పాదయాత్రకు రాయ సీమలో కూడా అనూహ్య స్పందన వస్తున్నట్టు చెప్పా రు. పార్టీ నేతలు, కార్యకర్తలు సైనికుల వలే పనిచేయాల న్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌ మల్లిక్‌నాయుడు, పార్టీ పరిశీలకుడు ఢిల్లీశ్వరరావు, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు బెండు మల్లేశ్వ రరావు, ముప్పిడి సురేష్‌, లంక శ్యామ్‌, కుమరాపు రవి, మాజీ ఎంపీపీ, డీజీఎం ఆనందరావు, మాజీ జడ్పీటీసీ గొర్లె లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com