ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాటల్లో పెట్టి మెడలో చైన్ దొంగతనం చేసిన దుండగులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 08, 2023, 05:07 PM

హిందూపురం పట్టణ పరిధిలోని మోతుకపల్లి వద్ద నడుచుకుంటూ వెళుతున్న సదానంద అనే వ్యక్తి మెడలో బం గారు గొలుసును బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు లాక్కెళ్లారు. హిందూపురం సమీపం లోని మోతుకపల్లి వద్ద ఉదయం నర్సరీ వద్దకు నడుచుకుంటూ వెళుతున్న సదానం దను ద్విచక్రవాహనంలో వచ్చిన ఇద్దరు దుండగులు టమోటా పైరు కావాలని అడుగుతూ మాటల్లో పెట్టారు. అతడ మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లి పరిగి వైపు వెళ్లిపోయారు. తేరుకున్న ఆయన కొద్దిసేపటి తర్వాత అటుగా వెళుతున్న వారికి చెప్పడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి వనటౌన పోలీసులు చేరుకుని పరిశీలించారు. బాధితుడి పిర్యాదు పేరకు కేసు నమోదు చేసినట్లు వనటౌన సీఐ వీరన్న తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com