ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తర విశాఖ 44 వ వార్డు లో రహదారి అధునీకరణ పనులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 08, 2023, 04:09 PM

జీవీఎంసీ 44 వ వార్డు పరిథి అబిద్ నగర్ వద్ద వార్డు కార్పొరేటర్ బాణాల శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో 96 లక్షల వ్యయంతో చేపట్టనున్న రహదారి అధునీకరణ పనులకు సంబందించి విశాఖ ఉత్తర నియోజక వర్గం సమన్వయ కర్త రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కెకె రాజు గురువారం శంకుస్థాపన చేసారు. అనంతరం సమీపంలో ఉన్న జీవీఎంసీ పార్క్ ను సందర్శించిన ఆయన పార్క్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సోలార్ ల్యంప్ ను పరిశీలించారు. అబిద్ నగర్ చేపట్టనున్న రహదారి అధునీకరణ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని కంట్రాక్టర్ కు సూచించారు. కార్యక్రమంలో అభిబ్, ఖాన్, కిషోర్, బాక్సర్ వెంకట రావు, బాబు రావు, హిర, గోపి, రెడ్డి, ఆదినారాయణ, కె నాగమణి, శ్యామల, సీతారాములు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com