ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అతిక్ మర్డర్ కేసుపై యూపీ పోలీసుల ఫోకస్,,షబానా అనే మహిళ గురించి ఆరా తీస్తున్న ఎస్టీఎఫ్

national |  Suryaa Desk  | Published : Fri, Apr 28, 2023, 10:00 PM

అతిక్ అహ్మద్ మర్డర్.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును ఉత్తరప్రదేశ్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నిఖార్సైన ఆఫీసర్లతో దర్యాప్తు చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఓ మహిళ పేరు ప్రముఖ్యంగా వినిపిస్తోంది. షబానా అనే మహిళ అతిక్ అహ్మద్‌కు చాలా దగ్గరగా ఉండేదని పోలీసులు గుర్తించారు. అతిక్‌ను కలవడానికి షబానా తరచూ డియోరియా జైలుకు వచ్చేదని తెలుస్తోంది.


అంతేకాదు.. అతిక్ సబర్మతి జైలుకు వెళ్లిన తర్వాత కూడా.. షబానా అతడిని కలిసిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రయాగ్‌రాజ్ ఏరియాలో షబానా ఉండేందుకు అతిక్ అహ్మద్ స్థలం కూడా ఇచ్చారని సమాచారం. అయితే.. ఇవన్నీ చేశారు కాబట్టి.. షబానా అతిక్ ఫ్యామిలీ మెంబర్ అనుకున్నారంతా. కానీ.. ఆమె అతిక్ కుటుంబ సభ్యురాలు కాదని పోలీసులు గుర్తించారు. దీంతో అసలు షబానా ఎవరు.. అతిక్‌తో ఆమెకు సంబంధం ఏంటీ అనే చర్చ జరుగుతోంది.


దంతేవాడ భయానక ఘటనపై ప్రత్యక్ష సాక్షి కీలక వ్యాఖ్యలు


అతిక్ భార్య షైస్తా పర్వీన్.. షబానాను అస్సలు ఇష్టపడేది కాదని ప్రచారం జరుగుతోంది. అతిక్, షబానాల మధ్య స్నేహమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే.. వీరి స్నేహం కేవలం వ్యక్తిగత జీవితానికి సంబంధించినదా.. లేదా క్రైమ్‌లో కూడా ఆమె ఇన్వాల్వ్ అయ్యిందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. అతిక్‌ను కోర్టులో హాజరుపరిచిన సమయంలో కూడా.. షబానా కోర్టు సమీపంలోకి వచ్చిందని ప్రచారం జరుగుతోంది. దీంతో పోలీసులు కోర్టులోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. గత ఐదు నెలలుగా షైస్తా, షబానా మధ్య గొడవలు జరిగడం కొస మెరుపు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com