ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో,,,మంగళూరులో ఐస్‌క్రీమ్ టేస్ట్ చేసిన రాహుల్ గాంధీ

national |  Suryaa Desk  | Published : Fri, Apr 28, 2023, 09:59 PM

కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ.. కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో భాగంగా  గురువారం మంగళూరులో ఆయన ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఓ హోటల్‌లో రాహుల్ ఐస్ క్రీమ్ టేస్ట్ చేశారు. రాహుల్ గాంధీ, ఇతర సీనియర్ నేతలు నవ్వుతూ.. జోకులు వేస్తూ.. ఐస్ క్రీమ్ తిన్నారు. ఆ ఫొటోలను కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. అనంతరం రాహుల్‌ను ఆలయానికి ఆహ్వానించారు. రాహుల్ గాంధీ అందుకు నిరాకరించారు. తాను చేపను తాకానని.. గుడి లోనికి రాలేనని స్పష్టం చేశారు.


ఆలయంలోకి రాలేను కానీ.. బయట నుంచి ప్రార్థనలు చేస్తానని రాహుల్ గాంధీ చెప్పారు. రాహుల్ అలా చెప్పడంతో.. అక్కడి ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయనపై ప్రశంసలు కురిపించారు. రాహుల్ గాంధీ ప్రజల మనసు గెలుచుకున్నారని నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రాహుల్ గాంధీ.. చేపను తాకినట్లు ఆలయ పూజారితో చెప్పడం వినిపిస్తోంది.


రాహుల్ గాంధీ మంగళూరులో ర్యాలీ నిర్వహించి.. ఆ తర్వాత ఉడిపిలోని మత్స్యకారులతో ముచ్చటించారు. మత్స్యకారులకు రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కర్నాటకలో పార్టీ అధికారంలోకి వస్తే.. మహిళలందరూ ప్రజా రవాణా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని స్పష్టం చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com