నందమూరి తారకరావు శత జయంతి వేడుకలు విజయవాడలో ప్రారంభమయ్యాయి. పోరంకిలోని అనుమోలు గార్డెన్స్లో జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, సౌత్ సూపర్స్టార్ రజనీకాంత్, నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. శత జయంతి వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎన్టీఆర్ అభిమానులు భారీగా తరలివచ్చారు.ఈ సమావేశంలో ఎన్టీఆర్ చరిత్రాత్మక ప్రసంగాలకు సంబంధించిన రెండు పుస్తకాలను రజనీకాంత్ ఆవిష్కరించారు. పుస్తక ప్రతిని బాలకృష్ణకు అందించారు.