ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ను ఢిల్లీ కోర్టు శుక్రవారం తిరస్కరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో సిసోడియాకు బెయిల్ మంజూరు చేయలేమని ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ పిటిషన్ను తిరస్కరించారు.ఇకపై విచారణకు కస్టడీ అవసరం లేదని రిలీవ్ చేయాలంటూ సిసోడియా వేసిన పిటిషన్పై వాదనలు విన్న న్యాయమూర్తి ఉత్తర్వులను రిజర్వ్లో ఉంచారు. ఈ పిటిషన్ను ఈడీ వ్యతిరేకించింది. విచారణ కీలక దశలో ఉందని చెప్పారు. మద్యం కుంభకోణానికి సంబంధించి తమ కొత్త మద్యం పాలసీకి ఆదరణ ఉందని చెప్పేందుకు నకిలీ ఈ-మెయిల్స్ను ఉపయోగించారని కూడా ఈడీ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.