సూపర్ స్టార్ రజనీకాంత్, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు ఉండవల్లిలోని తన నివాసంలో తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆతిథ్యం ఇచ్చారు. విజయవాడ పోరంకిలోని అనుమోలు గార్డెన్స్లో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు రజనీకాంత్ వచ్చారు. చంద్రబాబు ఇంట్లో జరిగిన పార్టీలో రజనీకాంత్, నటుడు బాలకృష్ణ, టీడీ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాల పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు రజనీకాంత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు.