ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు ఒంటిమిట్టకు ఏపీ గవర్నర్ రాక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 27, 2023, 03:00 PM

ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ శుక్రవారం ఒంటిమిట్టకు రానున్నారు. తిరుపతి నుంచి కడప విమానాశ్రయానికి హెలీకాప్టర్ లో చేరుకుని రహదారి మార్గంలో మధ్యాహ్నం 3. 40 గంటలకు ఒంటిమిట్ట తితిదే విశ్రాంతి భవనానికి చేరుకుంటారని అధికారులు గురువారం వెల్లడించారు. అనంతరం ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని సందర్శించి సీతారామలక్ష్మణమూర్తులను దర్శించుకుంటారు. సాయంత్రం 5. 30 గంటలకు కడప నగరంలోని అమీన్ పీర్ దర్గాకు చేరుకుని ప్రార్థనలు చేస్తారు. అక్కడ నుంచి కడప విమానశ్రయానికి చేరుకుని హెలీకాప్టర్లో రేణిగుంటకు బయలుదేరి వెళతారని వారు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com