ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా వైరస్‌లో తెరపైకి మరో వేరియంట్,,రాజస్థాన్ లోని ఉదయపూర్‌లో వెలుగులోకి

national |  Suryaa Desk  | Published : Wed, Apr 26, 2023, 10:07 PM

కరోనా కొత్త వేరియంట్ రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్‌లో బయటపడింది. అక్కడి మహారాణా భూపాల్ ఆసుపత్రికి కొందరు రోగులు వచ్చారు. వారిని పరీక్షించిన డాక్టర్లకు అనుమానం వచ్చింది. దీంతో వారి నమూనాలను సేకరించారు. వాటిని జైపూర్‌కు పంపారు. అక్కడ పరీక్షలు జరిపిన నిపుణులు.. ఇది కరోనా 7వ వేరియంట్‌గా గుర్తించారు. ఈ వేరియంట్ పేరు XBB 1.16 Omicron.


గతంలో వెలుగులోకి వచ్చిన వేరియంట్‌ల కంటే.. ఈ వేరియంట్ మరింత వేగంగా విస్తరిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే.. ఇది అంత ప్రాణాంతకం కాదని వెల్లడించారు. ఉదయపూర్‌లో 9 మంది రోగులకు ఈ వేరియంట్ సోకిందని.. వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని డాక్టర్లు చెప్పారు. ఉదయపూర్ జిల్లాలో సుమారు 250 మంది యాక్టివ్ పేషెంట్లు ఉన్నారు. వారందరూ హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.


ఈ వేరియంట్ సోకిన వారికి ఎవరికీ తీవ్రమైన లక్షణాలు లేవు. ఇంట్లోనే చికిత్స పొందుతూ.. కోలుకుంటున్నారు. అయినా.. అప్రమత్తంగా ఉండాలని, కరోనా నియమాలను పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని.. జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు.


రవీంద్రనాథ్ ఠాగూర్ మెడికల్ కాలేజీకి చెందిన మైక్రోబయాలజీ సీనియర్ ప్రొఫెసర్.. డాక్టర్ అన్షు శర్మ మాట్లాడుతూ.. కొందరి నమూనాలను జైపూర్‌కు పంపినట్లు చెప్పారు. అక్కడ ఈ 7వ వేరియంట్ తెరపైకి వచ్చిందన్నారు. వేరియంట్ ఏదయినా.. జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ఈ వేరియంట్.. చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని వివరించారు. ఇది మహారాష్ట్రతో సహా మరో రెండు, మూడు రాష్ట్రాల్లో బయటపడిందని చెప్పారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com