ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ కన్నుమూత

national |  Suryaa Desk  | Published : Wed, Apr 26, 2023, 10:04 PM

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ కన్నుమూశారు. మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో ఉదయం 8.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. సోమవారం వరకు ఆయనను ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి చికిత్స అందించారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతూ.. ప్రకాష్ సింగ్ బాదల్ వారం క్రితం మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది.


గత వారమే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. బాదల్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పంజాబ్‌కు ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన బాదల్‌కు పొట్టలో పుండ్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు తలెత్తాయి. ఈ కారణంగా గతేడాది జూన్‌లో ఆస్పత్రిలో చేరారు. గతేడాది జనవరిలో బాదల్‌కు కరోనా కూడా సోకింది. అప్పుడు లుథియానాలోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. కోవిడ్ అనంతరం కూడా ఆయనకు అనారోగ్య సమస్యలు వచ్చాయి.


ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సంతాపం తెలిపారు. ఆయనే కాకుండా ఇతర ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని సీనియర్ రాజకీయ నాయకుడు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ మరణం చాలా బాధాకరమని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com