ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసులో,,,అనుబంధ చార్జ్ షీట్ దాఖలు చేసిన సీబీఐ

national |  Suryaa Desk  | Published : Wed, Apr 26, 2023, 10:05 PM

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీబీఐ మంగళవారం రౌస్ అవెన్యూ కోర్టులో అనుబంధ చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, బుచ్చిబాబు, అర్జున్ పాండే, అమన్‌దీప్ దాల్‌లు నిందితులుగా ఉన్నారు. గతంలో సిసోడియా పేరు ఏ చార్జిషీట్‌ లోనూ లేదు. చార్జిషీట్‌లోని అంశాలపై వాదనలకు మే 12వ తేదీని కోర్టు ఖరారు చేసింది.


ఢిల్లీ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరుపుతోంది. దీనికి సంబంధించి ఫిబ్రవరి 26న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా ను కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కూడా సిసోడియాను ఈడీ విచారిస్తోంది. ఎక్సైజ్ పాలసీలో అవినీతికి సిసోడియా ప్రధాన కుట్రదారు అని ఆరోపించింది.


వారిస్ పంజాబ్ దే చీఫ్ అరెస్ట్‌లో భింద్రన్‌వాలే మేనల్లుడు


మరోవైపు మనీష్ సిసోడియా భార్య మంగళవారం ఆస్పత్రిలో చేరారు. ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌తో ఆమె బాధపడుతున్నారు. మనీష్ సిసోడియా అరెస్ట్ తర్వాత.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సిసోడియా నివాసంలో అతని భార్యను కలిసి ఓదార్చారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సీమా సిసోడియా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని కేజ్రీవాల్ వివరించారు. మనీష్ సిసోడియా కుమారుడు ప్రస్తుచం చదువు కోసం విదేశాల్లో ఉన్నారు.


2021-22 ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీలో.. మద్యం వ్యాపారులకు లైసెన్స్ ఇవ్వడం వల్ల కొంతమంది డీలర్లు లబ్ధి పొందారనే ఆరోపణ ఉంది. ఇందుకు లంచాలు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో గత వారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ సుమారు తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది. లిక్కర్ పాలసీ విషయం కల్పితమని అభివర్ణించిన కేజ్రీవాల్.. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా మారినందున కేంద్రం లక్ష్యంగా చేసుకుంటోందని వ్యాఖ్యానించారు.


లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలను మనీష్ సిసోడియా ఖండించారు. తన బెయిల్ పిటిషన్‌లో కీలక విషయాలు ప్రస్తానించారు. తనపై కేంద్ర ఏజెన్సీ వద్ద ఎటువంటి ఆధారాలు లేవని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో మొత్తం 10 మందిని అరెస్టు చేయగా.. సిసోడియా మినహా అందరూ బెయిల్‌పై బయట ఉన్నారు. ఇదే కేసులో.. తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు కుమార్తె కవితను కూడా ప్రశ్నించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com