తెలుగుదేశం నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.పెద్దప్పాపూర్ ఇసుక రీచ్ వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెయిల్ మంజూరు చేసేందుకు నోటీసుపై సంతకం చేయాలని పోలీసులు జేసీ ప్రభాకర్రెడ్డిని కోరారు. పెద్దపప్పూరు పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చారు. జేసీ అరెస్టును నిరసించారు. ఆ తరువాత పోలీసులు జేసీ ప్రభాకర్రెడ్డిని స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు.