వాయుకాలుష్యానికి దారితీసే కర్బన ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో కేంద్రం బీఎస్-6 ప్రమాణాలతో రూపొందించిన వాహనాలను విక్రయించేందుకు కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. 2020లో బీఎస్-4 వాహనాల విక్రయాలను నిలిపివేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. పాత మోడళ్లకు కేంద్రం ఏప్రిల్ 1 వరకు గడువు విధించింది. ఈ నిబంధన నేపథ్యంలో, రెనాల్ట్ క్విడ్, అమేజ్ డీజిల్ వెర్షన్ హోండా జాజ్, హోండా డబ్ల్యుఆర్-వి, నాల్గవ తరం హోండా సిటీ, హ్యుందాయ్ ఐ20 డీజిల్ వెర్షన్, గ్రాండ్ ఐ20 నియోస్, ఔరా, మారుతీ సుజుకి ఆల్టో 800, ఇగ్నిస్, సియాజ్, మహీంద్రా ఆల్టురాస్ జి4 , నిస్సాన్ కిక్స్, స్కోడా ఆక్టావియా మరియు సూపర్బ్ మోడల్లు భారత మార్కెట్లో నిలిపివేయబడతాయి.