ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘనంగా కళింగ కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 30, 2023, 12:43 PM

విశాఖ జిల్లా కళింగ కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక వనభోజన కార్యక్రమం ఆదివారం మాధవధార తోటల్లో నిర్వాహకురాలు పేడాడ రమణి కుమారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్ర ప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళింగ కులస్తులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.


అదేవిధంగా ఉదయ గోదావరి జిల్లా, విజయన గరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలతో పాటు అనేక రాష్ట్రాల్లో కళింగ అసోసియేషన్లు ఉన్నాయ ని ఆయా ప్రాంతాల్లో ఉన్న కళింగలు సమస్యల ను అసోసియేషన్ తెలియజేయాలని కోరారు. అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబ సభ్యుల సమస్యల పరిష్కారానికి తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తాన ని తెలియజేశారు. ఈ సందర్భంగా కళింగ కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక కార్యక్ర మాన్ని ఏర్పాటు చేసిన పేడాడ రమణకుమారి గారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్, శ్రీకాకుళం జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి పిరియా విజయ, మాజీ కేంద్ర మంత్రి కిళ్లి కృపారాణి, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్, మాజీ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ చౌదరి బాబ్జి, పోలీస్ అధికా రులు, న్యాయమూర్తులు, ప్రముఖ వైద్యులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, రెవిన్యూ అధికారులు, ప్రముఖ న్యాయవాదులు, వివిధ ప్రభుత్వ, కళింగ కుటుంబ సభ్యుల అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com