ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేమూరు క్రీడాకారిణికి బాపట్ల ఎంపి, ఆర్థిక సహాయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 30, 2023, 12:34 PM

ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డింగ్ క్రీడాకారిణికి బాపట్ల ఎంపీ నందిగం సురేష్ సోమవారం ఆర్థిక సహాయం అందజేశారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం వేమూరులోని రావూరు సరోజిని మనమరాలు ఎస్తేరు రాణి ఆంధ్రప్రదేశ్ బాడీబిల్డింగ్ క్రీడాకారిణిగా రాణిస్తుంది. ఈ క్రమంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ తన సహచరులు ప్రముఖ ఆర్కిటెక్ట్ బాలసాని కిరణ్, ఎక్స్ ల్లా ఎడ్యుకేషన్ చైర్మన్ అరివింద అరసవల్లి, కొర్రపాటి సురేష్ తో కలిసి 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. వీటితోపాటు ఒక సంవత్సర కాలానికి డైట్ & జిమ్ వసతులు ఏర్పాటు చేయడం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com