ఒడిశా మంత్రి నవ కిషోర్ దాస్ కన్నుమూశారు. భువనేశ్వర్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆదివారం ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయనపై ఏఎస్సై గోపాల్ దాస్ తన సర్వీస్ రివాల్వర్తో కాల్పులు జరిపారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు మంత్రి కిషోర్ దాస్ చికిత్స పొందుతున్న ఆస్పత్రికి సీఎం నవీన్ పట్నాయక్ వెళ్లి కుటుంబ సభ్యులను మంత్రి ఓదార్చారు.